
- ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేసి నోటీసులు జారీ
హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలోని హోటళ్లలో కుళ్లిన మాంసం, కెమికల్స్కలిపిన చికెన్ బయటపడ్డాయి. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కాలంచెల్లిన ఐస్ క్రీములు, బూజుపట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీతో చేసిన ఫుడ్ఐటెమ్స్ ను గుర్తించారు. హోటళ్ల నిర్వాహకులకు ఫుడ్సేఫ్టీ రూల్స్ మేరకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కుళ్లిన మాంసం అమ్ముతున్న బడా హోటల్స్బాగోతం మరోసారి బట్టబయలవడం సిటీలో కలకలం రేపింది.
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీషిక, సిబ్బంది సోమవారం హనుమకొండలోని ఫుడ్ ఆన్ ఫైర్, ల్యాండ్ మార్క్హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్లలో రూ.45 వేల విలువైన 32 కిలోల కుళ్లిన మటన్, చికెన్, రొయ్యలు వంటి మాంసం గుర్తించారు. పాల ప్యాకెట్లు, మసాలాలు, లేబుల్ డిఫెక్ట్స్ ఉన్న కార్న్, కొబ్బరి పొడి, ఫంగస్ కాలీఫ్లవర్, క్యాబేజీ వంటికి దొరికాయి. దుర్వాసన వచ్చే రీఫ్రిజరేటర్ తో పాటు అపరిశుభ్రంగా ఉన్న sతతవంట గదులను చూసి ఆఫీసర్లు షాక్అయ్యారు.
ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఫుడ్స్ అమ్ముతుండడంతో ఫుడ్సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్హెడ్ వి.జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించినందుకు హోటల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కొన్ని శాంపిల్స్ను హైదరాబాద్లోని ఫుడ్సేఫ్టీ ల్యాబ్ కు పంపారు. రిపోర్ట్ లో కల్తీ ఆహార పదార్థాలని నిర్ధారణ అయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జ్యోతిర్మయి స్పష్టంచేశారు. క్రిమినల్ కేసులు నమోదుతో పాటు సీజ్ కూడా చేస్తామని హెచ్చరించారు.