IPL 2024: ఐపీఎల్ తొలి మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు

IPL 2024: ఐపీఎల్ తొలి మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు

ఐపీఎల్ 2024 సీజన్ నేడు (మార్చి 22) గ్రాండ్ గా ప్రారంభమైంది. ఓపెనింగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో సమరానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా చెన్నై జట్టుకు కొత్త కెప్టెన్ పరిచయం కానున్నాడు. తొలిసారి యువ ఆటగాడు గైక్వాడ్ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడబోతుంది. 

చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఈ మ్యాచ్ ద్వారా సమీర్ రిజ్వీ చెన్నై తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేస్తున్నాడు.  

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): 

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్