మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్, వెలుగు: కరోనా, దీర్ఘకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు, జర్నలిస్టుల కుటుంబాలకు రూ.6.16 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 2015లో జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల గ్రాంట్ ప్రభుత్వం మంజూరు చేసిందని, అందులో రూ.34.50 కోట్లు సంక్షేమ నిధికి జమ అయ్యాయని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ నిధుల నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన 479 మందికి రూ.20 వేల చొప్పున, ప్రైమరీ కాంటాక్ట్ తో హోం క్వారంటైన్ లో ఉన్న 84 మందికి రూ.10 వేల చొప్పున, 260 మంది జర్నలిస్టులు చనిపోగా ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున అందజేశామన్నారు.