కరోనాతో చనిపోయిన మృతుడి కుటుంబానికి రూ.60 వేలు సాయం

కరోనాతో చనిపోయిన మృతుడి కుటుంబానికి రూ.60 వేలు సాయం

జగిత్యాల జిల్లా: బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లి కరోనా వ్యాధితో మృతి చెందిన మునిగంటి మల్లేశం(48) కుటుంబానికి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ఇటిసిఎ) స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయం చేసింది. ఇటీవల దుబాయ్ లో కరోనా వ్యాధి సోకి మరణించడంతో ఇదే స్వచ్ఛంద సంస్థ ..మల్లేషం అంత్యక్రియలు హిందు సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మోహన్ రావు పేట్ గ్రామంలో మృతుడు మల్లేషంకు వృద్దురాలైన తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మృతుడు మల్లేషం ఫ్యామిలీ ఆర్థికంగా వెనకబడి ఉండటంతో సాయం చేయడానికి ముందుకు వచ్చింది ఇటిసిఎ స్వచ్ఛంద సంస్థ. బుధవారం సంస్థ వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సేకరించిన రూ.60 వేల నగదును మల్లేషం ఫ్యామిలీకి అందజేశారు. ఈ సందర్భంగా సాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు మల్లేషం కుటుంబ సభ్యులు. కరోనా వైరస్ తో ఏప్రిల్ 27 న మరణించిన మునిగంటి మల్లేశం (48) అలియాస్ రాజం దహన సంస్కరాలు మే 5 వ తేదీన దుబాయిలో జరిగిన విషయం తెలిసిందే.