ఆర్​ఎస్​ బ్రదర్స్​ ఫెస్టివల్​ ఆఫర్లు షురూ

ఆర్​ఎస్​ బ్రదర్స్​ ఫెస్టివల్​ ఆఫర్లు షురూ

హైదరాబాద్​, వెలుగు: దసరా, దీపావళి సందర్భంగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఆర్​ఎస్​ బ్రదర్స్​ ప్రకటించింది. ఈ సేల్​ సందర్భంగా షాపింగ్​ చేసేవాళ్లు 2.5 కిలోల బంగారాన్ని, 80 కేజీల వెండిని, 150 శామ్​సంగ్​ టీవీలను, 600 వెట్​గ్రైండర్లను, 1,375 ఎలక్ట్రిక్​ కుకర్ల వంటి ఎన్నో బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్​ బంపర్​ డ్రాల ఫలితాలను 5.10.22న, 26.10.22 తేదీలలో ప్రకటిస్తారు. విజేతలకు 25 బంగారు వడ్డాణాలు, 50 కేజీల వెండిపాత్రలను ఇస్తారు. అంతేగాక మూడుశాతం తరుగుతో బంగారు నగలు, మజూరీ లేని వెండి నగలు అందుబాటులో ఉన్నాయని ఆర్​ఎస్​ బ్రదర్స్ షాపింగ్​ మాల్​ డైరెక్టర్​ కేశవ్​ గుప్తా చెప్పారు. ఎస్​ఐబీ కార్డులతో కొంటే ఐదుశాతం క్యాష్​బ్యాక్​ కూడా వస్తుందని చెప్పారు. అయితే కనీసం రూ.నాలుగు వేల విలువైన వస్తువులు కొనాలి.