టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా భరిద్దామా?

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా భరిద్దామా?

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శలకు మరోమారు దిగారు. బతికి ఉన్న వారిని చనిపోయినట్లుగా, పేద ప్రజల్ని కోటీశ్వరులను చేసినట్లు కేసీఆర్ సర్కారు భ్రమ పెడుతోందని ఆయన మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్లు, నిరుద్యోగులకు భృతి ఇచ్చినట్లు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు అందుతున్నట్లు భ్రమ పెట్టే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంకెన్ని రోజులు భరిద్దామని ప్రశ్నిస్తూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘బతికే ఉన్నా సారూ.. పింఛనివ్వండి’ అనే శీర్షికతో ఓ తెలుగు దినపత్రికలో వచ్చిన వార్తను ఈ ట్వీట్ కు ఆయన జత చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

పెళ్లి కూతురైన ‘నాగిని’ హీరోయిన్

ఒమిక్రాన్‌ సోకితే 'డెల్టా' రాదన్న ICMR

భారత బాలుడిని తిరిగి అప్పగించిన చైనా