ఆదివాసీల హక్కులకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆదివాసీల హక్కులకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

డా బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్‌ లో పొందుపరచిన హక్కులతోపాటు జల్, జంగిల్, జమీన్‌పై సంపూర్ణ అధికారం ఆదివాసీలకు దక్కితేనే న్యాయం జరుగుతుందని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం అంబగట్టలో జనవరి 13వ తేదీ ఆదివాసుల పోరాటయోధుడు కొమురం భీమ్ విగ్రహన్ని ఆయన  ఆవిష్కరించారు.

అనంతరం ఆర్ఎస్ పీ మాట్లాడుతూ.. కొమురం భీమ్ పుట్టిన గడ్డపైనే ఆయన పోరాడి సాధించిన హక్కులకు ఆధిపత్య పాలకులు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. పెసా చట్టం, 1/70, జీవో నెం.3 లాంటి హక్కులను, చట్టాలను ఆదివాసీలకు దక్కకుండా పాలక ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఇందుకేనా కొమురం భీమ్ ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది అని ప్రశ్నించారు.  ఆ మహనీయుడి ఆశయ సాధనకు ఆదివాసీల గొంతుకై బీఎస్పీ పార్టీ నిరంతరం పోరాడుతుందని.. వారికి అండగా నిలబడుతుందని చెప్పారు.