
అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా పేరుందిన సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఆట తీరు అంతకంతకూ దిగజారుతోంది. కనీస పోరాటం లేకుండానే ప్రత్యర్థి జట్టుకు విజయాన్ని అప్పగించేస్తున్నారు. విదేశీ గడ్డపై ఎదురయ్యే ఓటముల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. సొంత దేశంలోనూ అవే ఫలితాలు చవిచూస్తున్నారు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ప్రోటీస్ జట్టు ఏకంగా 111 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్మిత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ (92; 49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. సింగపూర్ బెటర్ టీమ్ డేవిడ్ (64; 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ప్రోటీస్ బౌలర్లలో లిజార్డ్ విలియమ్స్ 3 వికెట్లు తీసుకోగా.. కోజీ, షంశీ, మార్కో జన్ సెన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం 227 పరుగుల లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఏ దిశలను విజయం వైపు అడుగులు వేయలేదు. 15.3 ఓవర్లలో 115 పరుగుల వద్ద అలౌట్ అయ్యారు. ఆ జట్టు ఓపెనర్ రీజా హేన్రిక్స్ ఒక్కడే 56 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ టెంబా బవుమా తొలి ఓవర్ లోని డకౌట్ అవ్వగా, వాండర్ డస్సెన్ 2, మక్రమ్ 7, డేవాల్డ్ బ్రేవిస్ 5, స్టబ్స్ డకౌట్..ఇలా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఆసీస్ బౌలర్లలో తన్వీర్ సంగా 4 వికెట్లు తీసుకోగా.. స్టోయినిస్ 3, స్పెన్సర్ జాన్సన్ 2, సీన్ అబౌట్ ఒక వికెట్ తీసుకున్నారు.
ఈ విజయంతో ఆసీస్ జట్టు మూడు మ్యాచ్లో టి20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా రెండో టి20 జరగనుంది.