- టెస్ట్ ట్రాక్లలో అవకతవకలు, రూల్స్ బ్రేక్ చేస్తున్నారని గుర్తింపు
- ఏజెంట్ల హవా కంటిన్యూ అవుతుండడంతో ఆగ్రహం
- నిబంధనలు పాటించకపోతే విచారణ, సస్పెన్షన్
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలోని ఆర్టీఏ ఆఫీసులు, టెస్టు ట్రాక్ లలో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్ నిఘా తీవ్రతరం చేసింది. డ్రైవింగ్ ట్రాక్ లలో నిర్వహిస్తున్న టెస్టుల్లో కొందరు ఎంవీఐలు రూల్స్పాటించడం లేదని, డ్రైవింగ్రాని వారిని కూడా టెస్టుల్లో పాస్ చేసి లైసెన్స్ జారీ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో సీరియస్అయ్యింది.
టెస్ట్ కు అభ్యర్థులు రాకపోయినా లైసెన్స్ ఇస్తున్నారని తెలియడంతో తనిఖీలు చేసి నిజమేనని తేల్చింది. కొందరు అధికారులు ఏజెంట్లతో కుమ్మక్కై ఇలా చేస్తున్నారని గుర్తించింది. ప్రస్తుతం చాలా పనులు ఆన్లైన్లోనే జరుగుతున్నా కొన్ని విషయాల్లో తప్పని సరిగా ఆఫీసుకు రావాల్సి వస్తున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లను రంగంలోకి దింపుతున్న కొందరు అధికారులు డీల్చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ తనిఖీలు చేయగా నిజమేనని తేలడంతో రూల్స్పక్కాగా ఫాలో కావాలని హెచ్చరించినట్టు సమాచారం. డ్రైవింగ్ట్రాక్లో టెస్ట్ప్రారంభానికి ముందే ఎంవీఐలు దరఖాస్తుదారుడి ఆధార్కార్డు, గుర్తింపు కార్డు, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రతి పరీక్ష తర్వాత రిజిస్టర్లో ఫలితాలు నమోదుచేయాలని, పరీక్షా టైంలో సీసీ టీవీ కెమెరాలు నిరంతరం పని చేస్తుండాలని, నిఘా పరికరాలను ఆపకూడదని వార్నింగ్ఇచ్చింది.
డైరెక్ట్ సస్పెన్షనే..
సిటీలోని ఆర్టీఏ ఆఫీసుల్లోకి ఏజెంట్లను..అలాగే డ్రైవింగ్ట్రాక్ప్రాంగణంలోకి ప్రైవేట్వ్యక్తులు, బ్రోకర్లు, డ్రైవింగ్స్కూల్ప్రతినిధులను రానివ్వకూడదని ఖచ్చిత ఆదేశాలిచ్చారు.
ప్రైవేట్వ్యక్తులకు సహకరించినట్టు తెలిసినా, లావాదేవీలు, చెల్లింపులు జరిపినా సదరు అధికారిపై విచారణ జరపడంతో పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. డిజిటల్రికార్డులు, ఫిజికల్రిజిస్టర్లు రోజువారీగా సరిపోలాలని, ఏ మాత్రం తేడా వచ్చినా ఆర్టీఓకు నివేదించాలన్నారు. నెలవారీ రిపోర్టులను ఎంవీఐలు కమిషనర్ ఆఫీసుకు పంపించాలన్నారు.
