జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నియమ నిబంధనలను పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. ప్రచారం సందర్భంగా నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, తదితర సందర్భాల్లోనూ నియమాలు పాటించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురువారం జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను తెలిపారు
* గోడలమీద వ్రాతలు, పోస్టర్లు/ పేపర్లు అంటించుట, లేక మరే ఇతర విధంగా కానీ ప్రభుత్వ ఆవరణలను (భవనాలు మొదలైన కట్టడాలు) పాడు చేయుట నిషేదం.
* పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథిన్ తో తయారైన పోస్టర్లు/ బ్యానర్ల వాడకం నివారించేందుకు ప్రయత్నించాలి.
* ఎన్నికల కరపత్రం లేక పోస్టరుపై ఆ ప్రింటరు మరియు పబ్లిషరు పేర్లు, అడ్రస్సులు లేకుండా ముంద్రించరాదు. లేక ప్రచురించరాదు.
* ప్రత్యేక ఉపకరణాలు ధరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వాటికి అయ్యే ఖర్చు మాత్రం అభ్యర్థి ఎన్నికల వ్యయ పట్టికలో నమోదు చేయాలి.
* ఎన్నికల పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుండి, అభ్యర్థి తన ఎన్నికల నిమిత్తం ప్రజలకు, సినిమాటోగ్రఫి, టెలివిజన్ లేదా ఇతర తత్సమాన ప్రచార సాధనాలు వినియోగించుట నిషేదం.
* లౌడ్ స్పీకర్లు వాడడానికి సంబంధిత పోలీసు అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలి.
* బహిరంగ సమావేశాలు రహదారి ప్రదర్శనలలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మరియు ఇతర సంందర్భాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించబడతాయి.
* పబ్లిక్ సమావేశాలు రాత్రి 10 గంటల దాటిన తరువాత మరియు ఉదయం 6 గంటల కన్నా ముందు నిర్వహించరాదు. ఎన్నికల పోలింగ్ ముగిసే సమాయానికి 48 గంటల ముందు నుండి పోలింగ్ ముగిసే వరకు ఎటువంటి పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు.
* అధికారిక యంత్రాంగం ద్వారా ఓటర్లకు అధికారిక ఫోటో గుర్తింపు స్లిప్ జారీ చేయబడుచున్నందున, అభ్యర్థులు అనధికారిక గుర్తింపు స్లిప్స్ ఇవ్వకూడదు.