కౌన్సిలర్ ఇంట్లో కరోనాకు ట్రీట్మెంట్
కంప్లయింట్ చేసిన స్థానికులు
జగిత్యాల,వెలుగు: అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త, ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా ఇంటిపైనే ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. చుట్టూ కవర్లు కట్టి కరోనా ట్రీట్మెంట్ ఇస్తుండగా స్థానికులు పోలీసులకు, వైద్యాధికారులకు కంప్లయింట్ చేశారు. జగిత్యాలలోని 38 వ వార్డు కౌన్సిలర్ లావణ్య భర్త ప్రవీణ్ ఆర్ఎంపీగా ట్రీట్మెంట్ ఇస్తుండేవాడు. కొద్ది రోజులుగా 39 వ వార్డులో ఉన్న తన ఇంటిపై చుట్టూ కవర్లు కట్టి కరోనా పాజిటివ్ వచ్చిన పేషంట్లకు చికిత్స చేస్తున్నాడని స్థానికులు గుర్తించి నిరసన తెలిపారు. దీంతో అతడు పేషంట్స్ ను పంపించేశాడు. దీంతో వారు టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వెళ్లోలోపే బంగ్లా పైన మొత్తం క్లీన్ చేసేశారు. స్థానికులు మాట్లాడుతూ పబ్లిక్ ప్లేసుల్లో ఓ ఆర్ఎంపీ కరోనా పేషంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఏమిటన్నారు. ఇది తమతో పాటే ఆ పేషంట్లకు కూడా ప్రమాదమేనన్నారు.