ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ పోస్ట్ మాస్టర్లు సమ్మె

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ పోస్ట్ మాస్టర్లు సమ్మె

అలంపూర్/హన్వాడ/లింగాల/నాగర్​కర్నూల్​టౌన్,వెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ పోస్ట్ మాస్టర్లు సమ్మె చేశారు. విధులను బహిష్కరించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామీణ పోస్ట్  మాస్టర్లు మాట్లాడుతూ 8 గంటల పని, పెన్షన్​తో పాటు అన్ని బెనిఫిట్స్​ మంజూరు చేయాలని డిమాండ్  చేశారు.

వేధింపులు మానుకోవాలని కోరారు. డివిజన్ అసిస్టెంట్ సెక్రటరీ బాలాజీ నాయక్, ఉద్యోగుల సంఘం  డివిజన్  ప్రెసిడెంట్  పరమేశ్వర్, అబ్దుల్ జలీల్, రాంగోపాల్, బాషా, భూమిక, మద్దమ్మ, రేష్మా, సుజాత, యోగి, బాలు, జోత్స్న, ఉమాపతి, కేశవులు, శంకర్, రాజు, ప్రభు, జానకి రాములు, అనిల్, ఖుద్దూస్, కుమార్  పాల్గొన్నారు.