న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశంలో కొత్త కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ల ఏర్పాటు రికార్డు లెవెల్కి చేరింది. బిజినెస్ క్లైమేట్పట్ల ఆశావాదం, ఎకనమిక్ గ్రోత్పై నమ్మకం వల్లే కొత్త సంస్థల ఏర్పాటు జోరందుకుంటోందని సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. షార్ట్టర్మ్లో గ్లోబల్ అనిశ్చితుల ఎఫెక్ట్ ఉన్నప్పటికీ, మిడ్టర్మ్–లాంగ్ టర్మ్లలో బిజినెస్లు బాగా నడుస్తాయనే ఆశావాదాన్ని ఈ ట్రెండ్ రిఫ్లెక్ట్ చేస్తుందని వారు పేర్కొన్నారు.
ఏప్రిల్–సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో దేశంలో కొత్తగా 1,20,966 కంపెనీలు, ఎల్ఎల్పీలు ఏర్పాటయినట్లు అఫీషియల్ డేటా వెల్లడిస్తోంది. అంతకు ముందు ఏడాదిలోని 1,08,583 తో పోలిస్తే ఇది 11.4 శాతం ఎక్కువని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫెయిర్స్ (ఎంసీఏ) డేటా చెబుతోంది. ఎంసీఏ 21 పోర్టల్లో టెక్నికల్ లోపాలపై కంప్లెయింట్లు ఎక్కువైన నేపథ్యంలో దేశంలో కంపెనీల ఏర్పాటు సంఖ్య భారీగా పెరగడం విశేషం. అంతేకాదు, షెల్ కంపెనీలపై కొరడా విధించడంతోపాటు, కఠినమైన చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోంది.
అయినా, కొత్త బిజినెస్ల ఏర్పాటు జోరందుకుంటోందని ఒక సీనియర్ ఆఫీసర్ పేర్కొన్నారు. రూల్స్ పాటింపులోని ఇబ్బందులు తగ్గించే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కూడా కొత్త బిజినెస్ల ఏర్పాటుకు ఒక కారణంగా వివరించారు. కంప్లయెన్స్ భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని ఆయన చెప్పారు. 39 వేలకు పైగా పనికిరాని రూల్స్ను ఎత్తివేయడంతోపాటు, 1,500 చట్టాలకు స్వస్తి పలికినట్లు కిందటి వారంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే.