రెండో సర్వేలోనూ వెనుకబడ్డ రుషి సునాక్​

రెండో సర్వేలోనూ వెనుకబడ్డ రుషి సునాక్​

లండన్: బ్రిటన్​ ప్రధానమంత్రి రేసులో ఆ దేశ విదేశాంగ మంత్రి లిజ్​ ట్రస్​ దూసుకెళుతున్నారు. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన రుషి సునక్​ కంటే ఆమె చాలా ముందున్నారు. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ స్థానాన్ని భర్తీ చేసేందుకు అధికార కన్జర్వేటివ్​ పార్టీలో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సర్వేలో రుషి సునక్​ కంటే లిజ్​ ట్రెస్​ ముందంజలో ఉన్నట్టు వెల్లడయ్యింది. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల ప్రకారం ట్రస్​కు 58 శాతం మంది టోరి మెంబర్ల మద్దతు ఉన్నట్టు తేలింది. మాజీ చాన్స్​లర్​ రుషికి 26 శాతం మాత్రమే మద్దతు దక్కింది.

12 శాతం మంది ఎటూ తేల్చుకోలేదు. మరోవైపు యూగోవ్​ పోల్​లో అన్ని వయసుల వారి నుంచి ట్రస్​కు సపోర్ట్ లభించింది. యూగోవ్​ పోల్​ తో ట్రస్​ 38 పాయింట్ల లీడ్​లో ఉన్నారు. ఆమె ప్రత్యర్థులు, ఎటు తేల్చుకోలేని వారి సంఖ్య 16 పాయింట్లుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుషి గెలవాలంటే అద్భుతం జరగాల్సి ఉందని పరిశీలకు భావిస్తున్నారు. మాజీ వైద్య శాఖ మంత్రి సాజిద్​ జావెద్​ చివరి నిమిషంలో ట్రస్​కు మద్దతు తెలిపి రుషికి షాకిచ్చారు.