ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ పై రష్యా డ్రోన్స్‌‌‌‌‌‌‌‌, మిసైల్స్‌‌‌‌‌‌‌‌ తో దాడి.. 10 మంది మృతి

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ పై రష్యా డ్రోన్స్‌‌‌‌‌‌‌‌, మిసైల్స్‌‌‌‌‌‌‌‌ తో దాడి.. 10 మంది మృతి

కీవ్‌‌‌‌‌‌‌‌: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా చేసిన తాజా డ్రోన్స్‌‌‌‌‌‌‌‌, మిసైల్స్‌‌‌‌‌‌‌‌ దాడిలో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 352 డ్రోన్స్‌‌‌‌‌‌‌‌, 11 బాలిస్టిక్‌‌‌‌‌‌‌‌ మిసైల్స్‌‌‌‌‌‌‌‌, 5 క్రూజ్‌‌‌‌‌‌‌‌ మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌తో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. అయితే, 339 డ్రోన్స్‌‌‌‌‌‌‌‌, 15 మిసైల్స్‌‌‌‌‌‌‌‌ వాటి టార్గెట్స్‌‌‌‌‌‌‌‌ను రీచ్‌‌‌‌‌‌‌‌ కాకుండా అడ్డుకున్నామని చెప్పింది. 

రష్యా ప్రయోగించిన డ్రోన్స్‌‌‌‌‌‌‌‌, మిసైల్స్‌‌‌‌‌‌‌‌ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లోని ఇండ్ల సముదాయాలు, హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌, క్రీడా భవనాలపై పడ్డాయని ఎమర్జెన్సీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో పలు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు, వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ధ్వంసం అయ్యాయన్నారు. బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేపట్టామని తెలిపారు. ఇప్పటికే ఏడు మృతదేహాలను వెలికితీశామని, శిథిలాల కింద మరికొంత మంది ఉండే అవకాశం ఉందన్నారు.