ఉక్రెయిన్ డిఫెన్స్ను కకావికలం చేసేందుకు రష్యా అన్నిరకాలుగా ప్రయత్ని స్తోంది. కీవ్తో పాటు ప్రధాన నగరాలపై దాడులు పెంచింది. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మూడు వారాలు పూర్తయి నా సాధ్యంకాక పోవడంతో రష్యాలో అసహనం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఓవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు దాడులు పెంచింది. కీవ్ సిటీపై బాంబు ల వర్షం కురిపించడంతో 12అంతస్తుల బిల్డింగ్లో మంటలు చెలరేగా యి. చుట్టుపక్కల బిల్డింగ్లకూ నిప్పంటుకుంది. కీవ్ సిటీకి ఇంకా 15 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్ నుంచి యూరోప్ దేశాలకు శరణార్ధులుగా చేరుకున్న వారి సంఖ్య 30 లక్షలు దాటింది. ఉక్రెయిన్లో పరిస్థితులపై చర్చించేందుకు నాటో సభ్య దేశాల రక్షణ మంత్రులు బుధవారం బ్రెసెల్స్లో సమావేశమయ్యారు.