ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి చేరుకున్న ఆయన.. శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్తో సమావేశం కానున్నారు. రష్యా, భారత్ సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియా.. మరిన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ పై దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇండియా మరోసారి కోరనుంది. శాంతిచర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంతర్జాతీయ వేదికలపై భారత్ పదేపదే చెబుతోంది.
For More News..