నాన్ స్టాప్ గా డ్రోన్లతో అటాక్ .. ఉక్రెయిన్ పై 10 గంటలపాటు 400 డ్రోన్లు, 18 మిసైల్స్ ప్రయోగించిన రష్యా

నాన్ స్టాప్ గా డ్రోన్లతో అటాక్ .. ఉక్రెయిన్ పై 10 గంటలపాటు 400 డ్రోన్లు, 18 మిసైల్స్ ప్రయోగించిన రష్యా
  • రాజధాని కీవ్ లో ఇద్దరు మృతి.. 16 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్​పై రష్యా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భీకర దాడులకు దిగింది. 18 మిసైళ్లు, 400కు పైగా డ్రోన్లతో రష్యా అటాక్ చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారు. 16 మంది గాయపడ్డారు. మూడేండ్లుగా కొనసాగుతున్న వార్​లో అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నాన్ స్టాప్​గా 10 గంటల పాటు దాడులు చేస్తూనే ఉన్నది.

 కీవ్​తో పాటు మొత్తం 9 డిస్ట్రిక్స్​ను లక్ష్యంగా రష్యా అటాక్ చేసింది. దాడిలో రెసిడెన్షియల్ బిల్డింగ్​లు, గోదాములు, ఆఫీసులు, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్​లు దెబ్బతిన్నాయి. కీవ్‌‌‌‌లోని షెవ్‌‌‌‌చెంకివ్‌‌‌‌స్కీ డిస్ట్రిక్​లో ఒక అపార్ట్‌‌‌‌మెంట్ భవనం పైభాగంలో శిథిలాలు పడటంతో బిల్డింగ్ దెబ్బతిన్నది. హోలోసివ్‌‌‌‌స్కీ డిస్ట్రిక్​లో దాడుల కారణంగా ఒక మెడికల్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. స్వియాటోషిన్‌‌‌‌స్కీ డిస్ట్రిక్​లో గోదాములు, కార్లు కాలి బూడిదయ్యాయి. 

రష్యా దాడులను దీటుగా ఎదుర్కొన్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మొత్తం 711 డ్రోన్లు, 7 మిసైళ్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. దాడులు ఆపేందుకు రష్యాపై ఒత్తిడి పెంచాలని పలు దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్​స్కీ కోరారు.  కాగా, ఒక్క జూన్ లోనే 232 మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. 1,343 మంది గాయపడ్డారు. మూడేండ్లుగా కొనసాగుతున్న వార్​లో జూన్​లోనే ఎక్కువ మంది చనిపోయారు. జూన్ 1న తమ ఎయిర్​బేస్​లపై ఉక్రెయిన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఈ అటాక్ చేసినట్లు రష్యా ప్రకటించింది. 

ఉక్రెయిన్​కు మళ్లీ అమెరికా వెపన్స్

ఉక్రెయిన్​కు ఆయుధాల సరఫరాను అమెరికా మళ్లీ ప్రారంభించింది. వారం రోజుల పాటు వెపన్స్ సప్లైను అమెరికా ఆపేసింది. ఉక్రెయిన్​కు అమెరికా 155 ఎంఎం ఆర్టిలరీ షెల్స్, హైమార్స్, ఎంఎల్ఆర్​లు, జీఎంఎల్ఆర్ఎస్ (గైడెడ్ మల్టిపుల్ లాంచ్​ రాకెట్ సిస్టమ్) మిసైళ్లను పంపింది. ఉక్రెయిన్​పై ఇటీవల రష్యా దాడులు చేసింది. వీటిని తిప్పి కొట్టేందుకుగాను ఈ ఆయుధాలను ఉక్రెయిన్​కు అమెరికా పంపింది. తమ వద్ద ఎన్ని మిసైళ్లు, డ్రోన్లు ఉన్నాయో లెక్కేసుకునేందుకు కొన్ని వారాల పాటు వెపన్స్ సప్లై ఆపేసినట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్​సేత్ తెలిపారు. ఇకపై ఉక్రెయిన్​కు వెపన్స్ సప్లై కొనసాగుతుందని ప్రకటించారు.