వచ్చే వారం పుతిన్, జెలెన్​స్కీతో గుటెరస్​ భేటీ

వచ్చే వారం పుతిన్, జెలెన్​స్కీతో గుటెరస్​ భేటీ

 

  •     ప్లాంట్ లోపల ఉన్న వారి పరిస్థితిపై ఆందోళన
  •     కొద్ది రోజుల క్రితం దాడులు చేయబోమని పుతిన్​ ప్రకటన
  •     అందుకు విరుద్ధంగా దాడుల తీవ్రత పెంచిన బలగాలు
  •     తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్​ సేనలు

కీవ్: పోర్ట్ సిటీ మరియుపోల్​లోని అజోవ్ స్టల్​ స్టీల్​ ప్లాంట్​ పై రష్యా మళ్లీ దాడులు చేస్తోంది. ప్లాంట్​ను స్వాధీనం చేసుకునేందుకుగానూ ఎయిర్​స్ట్రైక్స్​ను ముమ్మరం చేసింది. మరియుపోల్ ను​దాదాపు రష్యా స్వాధీనం చేసుకున్నా.. స్టీల్​ ప్లాంట్​లో మాత్రం దానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అజోవ్​స్టల్​ స్టీల్​ ప్లాంట్​కు వెళ్లే దారులన్నీ బంద్​ చేసింది. ప్లాంట్​లో ఉన్న వారికి ఆహారం, నీరు అందకుండా చేస్తోంది. రెండ్రోజుల క్రితం పుతిన్​ మరియుపోల్​కు విముక్తి కలిగించామని, అయితే స్టీల్​ ప్లాంట్​లోకి తమ సైనికులను పంపలేమని, దానికి బదులుగా ప్లాంట్​ను చుట్టుముడతామని, ఈగను కూడా బయటకు వెళ్లనివ్వబోమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా రష్యా మళ్లీ స్టీల్​ ప్లాంట్​పై వైమానిక దాడులకు దిగింది. 

బంకర్లలో చిన్నారులు, మహిళలు

11 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అజోవ్ స్టల్​ స్టీల్ ప్లాంట్​లో సుమారు 2 వేల మంది ఉక్రెయిన్​ సైనికులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరికి అదనంగా వెయ్యిమంది వరకు పౌరులు ఉండొచ్చని ఉక్రెయిన్​ వర్గాలు చెబుతున్నాయి. స్టీల్​ ప్లాంట్​పై రష్యా దాడుల విషయాన్ని ఉక్రెయిన్ ​ ప్రెసిడెంట్​ జెలెన్​స్కీ అడ్వయిజర్​ ఒలేకీ అరెస్టోవిచ్​ వెల్లడించారు. ప్లాంట్​పై రష్యా మళ్లీ వైమానిక దాడులు చేస్తోందని, లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రెండ్రోజుల క్రితం పుతిన్​ చెప్పిన మాటలకు ఇది వ్యతిరేకమన్నారు. రష్యా కొత్తగా ఇతర ప్రాంతాల్లో చేస్తున్న దాడులను తమ సేనలు తిప్పికొడుతున్నాయని చెప్పారు. స్టీల్​ ప్లాంట్​లో తలదాచుకున్న చిన్నారులు, మహిళలకు సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. 

కొనసాగుతున్న తరలింపు

మరియుపోల్ ​నుంచి ప్రజల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా సిటీ దాటించే ప్రయత్నం చేస్తున్నామని ఉక్రెయిన్​ డిప్యూటీ పీఎం ఇరినా వెరెస్​చుక్​ చెప్పారు. ఇక ఉక్రెయిన్​లోని డాన్​బాస్​ రీజియన్​పైనా దాడుల తీవ్రతను రష్యా పెంచింది. అయితే ఇక్కడ కూడా ఉక్రెయిన్​ సేనలు రష్యా దాడులను తిప్పికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎనిమిది రష్యా ఎటాక్​లను తిప్పికొట్టామని ఉక్రెయిన్​ సైనిక వర్గాలు తెలిపాయి. 
మాస్క్​వా వార్​షిప్​ మునిగిపోయింది: రష్యా
మాస్కో: నల్ల సముద్రంలో మాస్క్​వా మిస్సైల్​ క్రూయిజర్​ షిప్​ మునిగిపోయిందని రష్యా ప్రకటించింది. అగ్ని ప్రమాదం కారణంగా షిప్​ దెబ్బ తిని మునిగిపోయినట్టు వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, 27 మంది గల్లంతయ్యారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తమ దాడిలో మాస్క్​వా షిప్​ దెబ్బ తిని నీళ్లలో మునిగిపోయినట్టు కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్​ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయని రష్యా.. తాజాగా ఫైర్​ యాక్సిడెంట్​లో షిప్​ దెబ్బ తిందని పేర్కొంది.

యూఎన్​: ఉక్రెయిన్, రష్యా యుద్ధాని కి ముగింపు పలికేందుకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యూఎన్​ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్​ వచ్చే వారం రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. వేలాది ప్రాణాలు కాపా డేందుకు వెంటనే చర్యలు తీసుకోవా ల్సి ఉందని, ఉక్రెయిన్​లో శాంతి నెలకొనడం ద్వారా అక్కడ ఏర్పడిన మానవతా సంక్షోభానికి ముగింపు పలకాల్సి ఉందని, ఇందులో భాగం గా పుతిన్, జెలెన్​స్కీతో భేటీ అవుతా నని గుటెరస్​ ట్వీట్​ చేశారు. ఏప్రిల్​ 26న ఆయన మాస్కో చేరుకుంటార ని, తొలుత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్​తో, ఆ తర్వాత పుతిన్​తో భేటీ అవుతారని గుటెరస్​ అధికార ప్రతినిధి చెప్పారు. ఏప్రిల్​ 28న ఉక్రెయిన్​ వెళ్లి ఆ దేశ ప్రెసిడెంట్​ 
జెలెన్​స్కీతో భేటీ అవుతారన్నారు.