త్వరలోనే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

త్వరలోనే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

త్వరలోనే రైతుల  ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్న ఆయన.. కొన్ని రాజకీయ కారణాలతో నిధులు  రాలేదని తెలిపారు. కేంద్రం కావాలనే ఇబ్బంది పెడుతుందని, తామే నిధులు సమకూర్చుకొని రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. రైతులను పత్తి పంట ఎక్కువగా వేయాలని కోరుతున్నామని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారాల కోసం కాల్ సెంటర్ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే ఈ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చు. రైతులు సలహాలు, సూచనలు కూడా ఇవ్వొ్చ్చని నిరంజన్ రెడ్డి తెలిపారు.