పిల్లల వైద్యానికి రూ.30వేలు ఖర్చు పెట్టలేరా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

 పిల్లల వైద్యానికి రూ.30వేలు ఖర్చు పెట్టలేరా?  : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • బీఆర్ఎస్​ రాష్ట్ర నేత, మాజీ ఐపీఎస్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్​

పరకాల, వెలుగు : రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్​ కలిగిన రాష్ట్రంలో గురుకులాల్లోని పిల్లల వైద్యానికి రూ.30వేలు ఖర్చుపెట్టలేరా.. అని బీఆర్ఎస్ ​రాష్ట్ర నేత, మాజీ ఐపీఎస్​ఆర్.ఎస్​ప్రవీణ్​కుమార్ ​ప్రశ్నించారు.  ఇటీవల సోషల్​ వెల్ఫేర్​ హాస్టల్ లో ఉరేసుకుని చనిపోయిన విద్యార్థిని ఏకు శ్రీవాణి సంతాపసభను సోమవారం హనుమకొండ జిల్లా పరకాలలోని స్వర్ణ గార్డెన్స్​లో స్వేరోస్​ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన ప్రవీణ్​​ కుమార్ ​మాట్లాడుతూ.. గురుకులాల్లోని పిల్లలకు  కోడింగ్ ​భాష నేర్పించేందుకు   కేసీఆర్  తన హయంలో భువనగిరిలో ప్రత్యేక గురుకులాన్ని నెలకొల్పితే.. దాన్ని రేవంత్​సర్కారు మూసేసిందని ఆరోపించారు.  

వారంలో ముగ్గురు గురుకుల స్కూళ్ల  విద్యార్థులు  ఆత్మహత్య చేసుకున్నారని,  బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా పరామర్శించలేదని విమర్శించారు. కాంగ్రెస్​ సర్కారు దృష్టిలో సామాజిక న్యాయం అంటే చదువుకునే బిడ్డలను చంపడమా..? అని ఆయన ప్రశ్నించారు. గురుకులాల్లో ఫుడ్ ​పాయిజన్​ అయిన విషయాన్ని ప్రభుత్వం తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తోందని,  ఆ విషయాన్ని సీబీఐో, సీఐడీ, ఈడీ కో ఎందుకు అప్పగించడంలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్​ నేత ఏనుగు రాకేశ్ రెడ్డి, పీపీఎల్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, శ్రీవాణి కుటుంబ సభ్యులు, స్వేరోలు పాల్గొన్నారు.