
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి 11 వరకూ సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నారు. 1వ తరగతి నుంచి టెన్త్ వరకూ జరిగే పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటాయి. ఈ నెల 9న ముగుస్తాయి. 6,8 క్లాసులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.
7వ క్లాస్కు మధ్యాహ్నం 2గంటల నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు పెట్టనున్నారు. 9వ క్లాస్కు మధ్యాహ్నం 1.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల దాకా కొనసాగనున్నాయి. టెన్త్ క్లాసుకు ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎగ్జామ్ ఉంటుంది. ఈ నెల 30న ఫలితాలు రిలీజ్ చేయాలని, నవంబర్ 1న పేరెంట్స్ మీటింగ్ పెట్టి స్టూడెంట్ల ప్రోగ్రెస్ పై చర్చించాలని అధికారులు సూచించారు.