హైదరాబాద్: టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ సక్సెస్ అవుతాడని లెజెండ్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్ కోచ్ అవ్వడం శ్రీలంక టూర్లో జట్టుకు చాలా హెల్ప్ అవుతుందన్నాడు. లంకలో పర్యటించే ధవన్ నేతృత్వంలోని టీమ్కు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సచిన్ మాట్లాడుతూ.. ‘లంక టూర్కు వెళ్తున్న ప్లేయర్లు.. ద్రవిడ్తో ఇప్పటికే చాలా టైమ్ స్పెండ్ చేశారు. అతను ఏంటో వాళ్లకు బాగా తెలుసు. అదే సమయంలో ప్రతీ ప్లేయర్పై రాహుల్కు మంచి అవగాహన ఉంది. జట్టుతోపాటు డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంచగలిగిన వాడే సిసలైన కోచ్. రాహుల్ ఆ పనిలో సక్సెస్ అవుతాడని నాకు నమ్మకముంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్న ప్లేయర్లకు కొత్తగా కోచింగ్ ఇవ్వాల్సిన పని లేదు. కవర్ డ్రైవ్ ఎలా ఆడాలో ఔట్ స్వింగర్ ఎలా వేయాలో ఇప్పుడు కొత్తగా నేర్పించనవసరం లేదు. వారి ఆటలో ఏదైనా లోపం ఉంటే మాత్రం కోచ్ బాధ్యత తీసుకుని పరిష్కరించాలి. శిఖర్ ధవన్ పదేళ్లకు పైగా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్నాడు. కావాల్సినంత అనుభవం సంపాదించాడు. జట్టును బాగా హ్యాండిల్ చేస్తాడని అనుకుంటున్నా. లంక టూర్కు వెళ్లే టీమ్ యంగ్స్టర్స్, ఎక్స్పీరియెన్స్ ప్లేయర్లతో సమతూకంగా ఉంది. వీరికి రాహుల్ ద్రవిడ్ అండగా ఉండటం మరింత హెల్ప్ అవుతుంది’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. కాగా, నవోమి ఒసాకా, విరాట్ కోహ్లీ వంటి వారు మెంటల్ హెల్త్ ఇష్యూస్పై బహిరంగంగా మాట్లాడటం మంచి విషయమన్న మాస్టర్.. ఆ అంశంపై మరింత చర్చ జరిగితేనే పరిష్కారం దొరుకుతుందన్నాడు. ఏ అథ్లెట్కైనా ఫిజికల్తో పాటు మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమని వివరించాడు.
హెల్త్ విషయంలోనిర్లక్ష్యం వద్దు..
ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిసారించాలని, హెల్త్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని సచిన్ సూచించాడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా సచిన్ బుధవారం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు. ‘ఈ రోజు ఒలింపిక్ డే. ఒలింపిక్ గేమ్స్లో తమ బెస్ట్ ఇచ్చేందుకు మన అథ్లెట్లు ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. అదే విధంగా మనం కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ రోజు వర్కౌట్స్ చెయ్యాలి. అలా చెయ్యడం ద్వారా మనం ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉంటాం’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.