నాగార్జునసాగర్ బైఎలక్షన్కు గడువు మరో మూడు రోజులే ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కరోనాతో అకాల మరణం చెందడంతో సాగర్లో ఉపఎన్నిక అనివార్యమైంది. దాంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 30 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించింది. అయితే ఈ నెల 27,28,29 తేదీలను ఈసీ సెలవులుగా పరిగణించడంతో.. ఆ మూడు రోజులు నామినేషన్లు తీసుకోరు. ఇక మిగిలింది చివరి రోజైన 30వ తేదీ. కాబట్టి అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ లేకపోతే 30వ తేదీన తమతమ నామినేషన్లను సమర్పించాల్సిందిగా రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్, సువిధ, vigil app ద్వారా తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తామని.. ఏప్రిల్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఆయన తెలిపారు. ఏప్రిల్ 17న ఎన్నికలు నిర్వహించి.. మే రెండో తేదీన కౌంటింగ్ చేస్తామని ఎన్నికల అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు 11 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆయన తెలిపారు. కాగా.. టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలో ఉండటం గమనార్హం.
సాగర్ బైఎలక్షన్ నామినేషన్ గడువు మరో మూడురోజులే
- తెలంగాణం
- March 24, 2021
లేటెస్ట్
- నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష
- ఐపీఎల్ మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం
- ఒక బాటిల్ విస్కీ ధర రూ.5 లక్షలు!
- కాంగ్రెస్ అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది
- గుజరాత్కు ఆర్సీబీ షాక్.. 4 వికెట్ల తేడాతో నెగ్గిన రాయల్ చాలెంజర్స్
- బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులే..
- ఇవ్వాల తెలంగాణకి అమిత్ షా
- వెలుగు సక్సెస్: విపత్తు నిర్వహణ సంస్థలు
- క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను మార్చం: నిర్మలా సీతారామన్
- వెలుగు సక్సెస్: కరెంట్ ఎఫైర్స్
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..