యాక్సిడెంట్ పై నరేష్ కామెంట్స్ .. నట్టికుమార్ రియాక్షన్

యాక్సిడెంట్ పై నరేష్ కామెంట్స్ .. నట్టికుమార్ రియాక్షన్
  • రేసింగుల్లో లేరు.. నార్మల్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడే స్కిడ్ కావడంతో ప్రమాదం: నరేష్
  • నరేష్ చెప్పింది తప్పు..  మాట్లాడింది నచ్చలేదు.. ఇక్కడితో వదిలిపెట్టండి: నట్టి కుమార్

హైదరాబాద్: హీరో  సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ పై నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేష్ మాట్లాడింది నచ్చలేదంటూ ఆడియో వాయిస్ మెసేజ్ మీడియాకు విడుదల చేశారు. తన మాటలు వక్రీకరిస్తున్నారని భావిస్తూ సీనియర్ నటుడు నరేష్ వీడియో సందేశం విడుదల చేయగా.. ఆయన మాటలను ఖండిస్తూ.. నట్టి కుమార్ ఆడియో మెసేజ్ విడుదల చేశారు. ఈ ఇద్దరి కామెంట్స్ సాధారణంగానే ఉన్నా.. బయట జరుగుతున్న ప్రచారం దుమారం రేపుతోంది. వీరిద్దరి మాటలు యధాతథంగా ఇలా ఉన్నాయి...
సీనియర్ నటుడు నరేష్ వీడియో సందేశం
సాయి ధరమ్ తేజ్ గురించి ఉదయమే దేవుడ్ని ప్రార్థించాను.. ఫాస్ట్ గా రికవరీ అవుతున్నాడు.. త్వరలో నార్మల్ పరిస్థితికి వస్తాడు.. వీరు చాయ్ షాప్ ఓపెనింగ్ కు వెళ్లారు. అయిపోయాక.. సెపరేట్ గా వస్తున్నారు.. రేసింగులో లేరు.. సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నార్మల్ స్పీడ్ లో నే వెళ్తున్నారు.. రోడ్డుపై మట్టి వల్ల స్కిడ్ అయి జారిపడ్డాడు. నిర్లక్ష్యం కాదు.. కేవలం ప్రమాదం మాత్రమే.. ప్రమాదాలు జరుగుతుంటాయి. సహజమే.. బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప వేరే ఆలోచన లేదు. సురక్షితంగా సాయి ధరమ్ తేజ్ బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తొందరగా కోలుకుని సినిమా షూటింగులు చేయాలని ప్రార్థిస్తున్నా.. ధన్యవాదములు అంటూ నరేష్ వీడియో సందేశం పోస్టు చేశారు. 
నిర్మాత నట్టి కుమార్ ఆడియో మేసేజ్: 
సాయి ధరమ్ తేజ్ తొందరగా కోలుకుని వెంటనే షూటింగులు మొదలుపెట్టాలని ఏసు ప్రభువును, దేవుడిని ప్రార్ధిద్దాం.. నరేష్ గారు పెద్దలు చెప్పింది నచ్చలేదు. ఇప్పుడు రాజకీయాలు  చేయడం సరైంది కాదు. ఆయన కుటుంబం కోసం.. ఆయన కోసం అందరం ప్రార్ధిద్దాం.. నరేష్ గారు చెప్పింది నచ్చలేదు. మీరు చెప్పింది తప్పు. మీరు చెప్పినట్లు ఆయన ఇంటి నుంచి సాయి వెళ్లలేదు.. ఆయన ఇంటికే సాయి ధరమ్ తేజ్ బయలుదేరి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నరేష్ మాటల్లో రేసింగ్ అనే మాటలు ప్రస్తావించడం బాగోలేదు. ఇలాంటి విషయాలు చెప్పడం తప్పు.  తప్పుడు సంకేతాలు వెళ్తాయి..  అందుకే నరేష్ మాట్లాడింది నచ్చలేదు. రోడ్డుపై ఇసుక ఉండడం వల్ల దురదృష్ట వశాత్తు స్కిడ్ అయి ప్రమాదానికి లోనయ్యారు. అంతే తప్ప మరొకటి కాదు.  ఏది ఏమైనా సాయి ధరమ్ తేజ్ తొందరగా కోలుకోవాలని, తిరిగి సినిమా షూటింగులు చేయాలని అందరం ప్రార్ధిద్దాం, అపోహలు కల్పించే మాటలు ఇక్కడితో వదిలిపెడడదాం.. సాయి ధరమ్ తేజ్ తొందరగా కోలుకుని తిరిగి సినిమా షూటింగులు చేద్దామని ప్రార్ధిద్దాం.. అంటూ  నిర్మాత నట్టి కుమార్ ఆడియో మేసేజ్ లో పేర్కొన్నారు.