సాయి పల్లవి బాలీవుడ్​ ఎంట్రీకి రెడీ..

సాయి పల్లవి బాలీవుడ్​ ఎంట్రీకి రెడీ..

న్యాచురల్​ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్ వినిపించనుంది. దక్షిణాది సినిమాలో స్టార్డం చూస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్​ను ఊపేయనుంది. సాయి పల్లవి బాలీవుడ్​ ఎంట్రీకి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదట. మనీశ్​ తివారి తెరకెక్కించనున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో కనిపించనుందని టాక్​. 

ఈ హీరోయిన్​ సీతగా నటించనుందని ఎప్పటినుంచో వార్తుల వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్​ ఈ సినిమా నుంచి సైడ్​ అయ్యిందని తెలుస్తోంది. రణ్​బీర్​ కపూర్​ రాముడిగా నటించనున్న ఈ సినిమాలో ఆలియాకు బదులు సాయి పల్లవి అయితే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో మరోసారి బీటౌన్​లో ప్రేమమ్​ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఈ నటి స్పందించాల్సి ఉంది.