కార్గో సేవల వల్ల RTC ఆదాయం పెరిగిందన్నారు RTC MD సజ్జనార్ . విహార యాత్రలకు, వివాహాలకు, సరకుల రవాణాకు RTC సేవలను ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ట్విటర్ లో తనకు సమాచారం ఇస్తే క్షణాల్లో RTC బస్ లను బుక్ చేస్తానన్నారు MD సజ్జనార్. ప్రజల సౌకర్యార్థం మారుమూల గ్రామాలకు కూడా బస్సులను నడుపుతున్నామన్నారు. కార్గో సేవల వల్ల RTC ఆదాయం పెరిగిందన్నారు సజ్జనార్. విహార యాత్రలకు, వివాహాలకు, సరకుల రవాణాకు RTC సేవలను ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు.. హైదరాబాద్ నుంచి RTC బస్సులో ప్రయాణం చేసి, నల్గొండ, మిర్యాలగూడ డిపో లను, బస్ స్టాండ్ లను సజ్జనార్ తనిఖీ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బస్ స్టాండ్ ల్లో మొక్కలు నాటి, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.