
- అలవెన్స్లు, మాజీ సభ్యుల పెన్షన్లు కూడా
- 2023 ఏప్రిల్ 1 నుంచే అమలులోకి.. కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. సభ్యులకు నెలనెలా అందించే శాలరీల్లో 24 శాతం హైక్ ప్రకటించింది. ప్రస్తుతం ఒక్కో ఎంపీ నెలకు రూ. లక్ష వేతనం అందుకుం టున్నారు. దీనిని తాజాగా రూ. లక్షా 24 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డెయిలీ అలవెన్సు రూ. 2 వేలు ఉండగా.. దాన్ని రూ.2,500కు పెంచింది. ఇక, మాజీ ఎంపీలకు ప్రస్తుతం రూ. 25 వేలు పెన్షన్ ఇస్తుండగా.. దాన్ని రూ. 31వే లకు చేర్చింది.
అదనపు పింఛన్లోనూ కేంద్రం మార్పులు చేసింది. ప్రస్తుతం రూ. 2 వేలుగా ఉన్న అడిషనల్ పెన్షన్ను రూ.2,500కు పెంచింది. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది.