ఉపఎన్నికల్లో ఓటమి..కీలక నిర్ణయం తీసుకున్న అఖిలేష్

ఉపఎన్నికల్లో ఓటమి..కీలక నిర్ణయం తీసుకున్న అఖిలేష్

సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల కమిటీలను ఆయన రద్దు చేశారు. యూత్, మహిళా, రాష్ట్ర, జిల్లా విభాగాల కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, యూపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మాత్రం పదవిలో కొనసాగుతారని తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ ఘోరంగా ఓడిపోయింది. ఎస్పీ కంచుకోటలైన రాంపూర్, అజంగఢ్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.