SP నేత అజంఖాన్ పరిస్థితి విషమం

SP నేత అజంఖాన్ పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్ వాది పార్టీ నేత అజంఖాన్ అత్యంత కీలకమైన వ్యక్తి. ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి ప్రారంభిస్తే..ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రయాణం ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఇప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారని లక్నోలోని మేదాంత ఆసుపత్రి  డాక్టర్లు ప్రకటించారు.

ఇటీవల అజంఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనపై ఉన్న కేసుల కారణంగా ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైల్లో ఉన్నారు. అయితే.. కరోనా కారణంగా ఆయనకు జైల్లోనే చికిత్స అందించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయనను ఈనెల 9న మేదాంత ఆస్పత్రికి తరలించారు. అజంఖాన్ తో పాటు ఆయన కుమారుడు అబ్దుల్లా ఖాన్ కు కూడా కరోనా సోకింది. దీంతో.. ఆయన్ను కూడా కూడా అదే  ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.