జనగామ అర్బన్, వెలుగు : రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా ఈ నెల 30 న ఉంటుందని ఫుడ్ఇన్స్పెక్టర్ సీహెచ్ వినీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ మేళా కలెక్టరేట్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7306335795, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ 9985820544 నంబర్ల లో సంప్రదించాలని పేర్కొన్నారు.
