కోటి రూపాయలు తిరిగి ఇచ్చేసిన సమంత..ఎందుకో తెలుసా?

కోటి రూపాయలు తిరిగి ఇచ్చేసిన సమంత..ఎందుకో తెలుసా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీం ప్రొమోషన్స్లో జోరు పెంచింది. లేటెస్ట్ గా సమంతకు సంబందించిన క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

సమంత ఖుషి మూవీ కోసం ఫస్ట్ కేటాయించిన డేట్స్కు  ముందుగానే తన రెమ్యునరేషన్ తీసుకోగా..లేటెస్ట్గా కోటి రూపాయల రెమ్యునరేషన్ని తిరిగి ఇచ్చినట్లు తెలుస్తుంది. సమంత హెల్త్ ఇస్యూ కారణంగా షూటింగ్లో సరిగా జాయిన్ కాలేకపోవడం వల్ల ప్రొడ్యూసర్స్కి కొంత నష్టం వచ్చిందని టాక్. దాదాపుగా సమంత వల్లే ఖుషి సినిమా షూటింగ్ 5 నెలలు పోస్ట్ పోన్ చేశారు మేకర్స్.

ఇక ప్రొడ్యూసర్స్కి ఎటువంటి నష్టం రాకూడదని తన రెమ్యునరేషన్లో నుంచి కోటి వరకు ఇచ్చిందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సామ్ ఫ్యాన్స్.. గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. వాస్తవానికి ఖుషి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. ఇక మూవీ షూటింగ్కు ముందే సగం రెమ్యూనరేషన్ తీసుకోగా..మిగతా అమౌంట్ మాపీ చేసినట్టు సమాచారం. 

సమంత ఖుషి మూవీ ప్రమోషన్స్లో సరిగా పాల్గొనపోయినప్పటికీ మ్యూజిక్ కన్సర్ట్ షోలో..సామ్ చేసిన డాన్స్తో కుర్రకారుకు పిచ్చెక్కించేసింది. అలాగే రీసెంట్గా విజయ్ దేవరకొండతో మిడ్ నైట్ వీడియో కాల్ చేసి మూవీ ప్రమోషన్స్ పై రియాక్ట్ అయింది.ఇక ఖుషి మూవీ రేపు (సెప్టెంబర్ 1న) రిలీజ్ అవుతుండటంతో ఆడియన్స్ ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు. రాఖీ ఫెస్టివల్లో రిలీజ్ చేస్తున్న ఈ ఫ్యామిలీ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే..హిట్ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.