సమంత పోస్ట్ వైరల్.. ఎందుకు ఇలా పెట్టింది

సమంత పోస్ట్ వైరల్.. ఎందుకు ఇలా పెట్టింది

తన బర్త్ డే సందర్భంగా సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు. దీంతో సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే.. ఈ సందర్బంగా సమంత తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఈ సెల్ఫీ ఫొటోని పోస్ట్ చేసిన సమంత.. దానికి 'ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఇయర్' అని కామెంట్ పెట్టింది. దీంతో.. ఈ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.

నిజానికి.. సమంత గత రెండేళ్లుగా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటోంది. నాగ చైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి.. ఇలా చాలా కాలంగా సమంత ఎదో ఒక రూపంలో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. కొంతకాలం క్రితమే మాయోసైటిస్ వ్యాధి నుండి బయట పడ్డ సమంత తాజాగా మరోసారి ఆక్సిజన్ మాస్క్ తో కనిపించడం షాక్ ఇచ్చింది. దీనికారణం ఆమె గత రెండు రోజుల నుండి హైపర్బేరిక్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ విషయం తెలిశాక సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

గత రెండు సంవత్సరాలుగా మానసికంగా, ఆరోగ్యం పరంగా ఎంతో భాదను అనుభవించిన సమంత.. ఈ పోస్ట్ పెట్టడంతో ఆమె అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇకనుంచైనా ఆమె ఎలాంటి సమస్యల భారిన పడకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ఆమె సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా.. ఈ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.