ట్రిపుల్ కెమెరాతో గెలాక్సీ ఏ17

ట్రిపుల్ కెమెరాతో గెలాక్సీ ఏ17

హైదరాబాద్​, వెలుగు: శామ్​సంగ్ గెలాక్సీ ఏ17 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్​ను హైదరాబాద్​లో సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్​లో పలు ఏఐ ఫీచర్లు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్​ (ఓఐఎస్)తో ట్రిపుల్​కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.  ఫోన్​ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఐపీ54 రేటింగ్​తో డస్ట్​, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉన్నాయి. గెలాక్సీ ఏ17 ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7తో పని చేస్తుంది. 

ఆరు సంవత్సరాల మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్​ను అందిస్తామని శామ్​సంగ్ సీనియర్​ఎగ్జిక్యూటివ్​ఆదిత్య బబ్బర్​ చెప్పారు. ధరలు రూ.19 వేల నుంచి రూ.24 వేల వరకు ఉంటాయని,  హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ బ్యాంక్ కార్డ్​లు లేదా యూపీఐ చెల్లింపులపై రూ. 1000 క్యాష్​బ్యాక్​ను కూడా పొందవచ్చని వివరించారు.