ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు

ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు

వర్ని,వెలుగు: రుద్రూర్, వర్ని, చందూరు మండలాల్లో  ప్రభుత్వ పనుల పేరుతో వే బిల్లులు తీసుకుని  ప్రైవేటు వ్యక్తులకు ఇసుక విక్రయిస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు.  రుద్రూర్​ మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం  పోతంగల్​ మండలం సుంకిని మంజీరా నది నుంచి ఇసుక తరలించేందుకు తహసీల్దార్ వే బిల్లు జారీ చేశారు. 

రుద్రూర్​ మండల కేంద్రంలో  సీసీరోడ్డు నిర్మాణం కోసం ఇసుక తరలించేందుకు  రెవెన్యూ అధికారులు  ట్రాక్టర్​ కు పర్మిషన్​ ఇచ్చారు. కానీ దీన్ని ఆసరా చేసుకున్న సదరు వ్యక్తి​ మంగళవారం రుద్రూర్​ బస్టాండ్​కు సమీపంలోని ఓ ప్రైవేటు వ్యక్తి ఇంటి ఆవరణలో ఇసుక డంప్​ చేసిన దృశ్యం వెలుగు కెమెరాకు చిక్కింది.