Prabhas: ప్రభాస్ సినిమా కోసం డైరెక్టర్కు వంద కోట్లు.. అది కూడా మూడో సినిమాకే!

Prabhas: ప్రభాస్ సినిమా కోసం డైరెక్టర్కు వంద కోట్లు.. అది కూడా మూడో సినిమాకే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇటీవలే సలార్(Salaar) తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తో కల్కి 2898 AD(Kalki 2898 AD) సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు.. ఓ పక్క కల్కి చేస్తూనే మరోపక్క దర్శకుడు మారుతి(Maruthi)తో రాజాసాబ్(Rajasaab) చేస్తున్నాడు ప్రభాస్. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఈ మధ్యే లాంఛనంగా ప్రారంభమైంది. 

ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు అధికార ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. ఇటీవలే యానిమల్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సందీప్ ప్రభాస్ తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా స్పిరిట్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం సందీప్ ఏకంగా రూ.100 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకోనున్నాడట. 

స్పిరిట్ సినిమాను ట్ సిరీస్ యజమాని భూషణ్ కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సందీప్ చేసిన యానిమల్ సినిమాకు కూడా ఆయనే నిర్మాతగా ఉన్నారు. అందుకే.. సందీప్ టాలెంట్ తెలుసు కాబట్టే ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడట భూషణ్. మరోపక్క ప్రభాస్ కూడా ఉన్నాడు కాబట్టి స్పిరిట్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయమనే లెక్కలో ఉన్నాడట భూషణ్ కుమార్. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక డైరెక్టర్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడవం ఇదేమి మొదటిసారి. అది కూడా కేవలం మూడు సినిమాలకే. ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇక ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.