హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా తన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. అదనపు డీఎస్పీ భుజంగరావు తనను ఆఫీసుకు పిలిపించి బెదిరించాడని చెప్పారు. గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని శ్రీధర్ ఆరోపించారు. త్వరలో అన్ని విషయాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానని తెలిపాడు.
ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. రాధా కిషన్ రావుపై సంధ్యా శ్రీధర్ రావు కంప్లైంట్