ఝరాసంగం/ జహీరాబాద్ వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాంతంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మౌలిక వసతుల పనులను స్పీడప్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్సూచించారు. శనివారం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలోని ఎల్గోయి, బర్దీపూర్, ఛీలెపల్లి, ఛీలెపల్లి తండా, రుక్మాపూర్, ముంగి ప్రాంతాల్లో పర్యటించి, ఆర్డీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్సిటీ నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న అంతర్గత రోడ్లు, ఫినిషింగ్ పనులను పరిశీలించారు.
మొదటి విడతలో స్మార్ట్ సిటీ నిర్మాణానికి కేటాయించిన భూమి వివరాలపై ఆరా తీసి, మ్యాప్ను పరిశీలించారు. నిమ్జ్ ప్రాంతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాల నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట నిమ్జ్ ప్రత్యేకాధికారి విషాలాక్షి, వీరారెడ్డి, ఆర్డీవో దేవుజా, డీఎస్పీ సైదానాయక్, సీఐ హన్మంతు, తహసీల్దార్ భాస్కర్ ఉన్నారు.
