బీజేపీకి దేశ వ్యాప్తంగా 110 సీట్లు తగ్గుతయ్: సంజయ్ రౌత్

బీజేపీకి దేశ వ్యాప్తంగా 110 సీట్లు తగ్గుతయ్: సంజయ్ రౌత్

ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు శివసేన(బాలా సాహేబ్ ఉద్ధవ్ ఠాక్రే) నేత సంజయ్ రౌత్. మహా వికాస్ అఘాడి  బంధం బలంగా ఉందన్నారు.. అజిత్ పవార్‌కు సంబంధించిన రూమర్స్ అవాస్తవమని చెప్పారు. అజిత్ పవార్ ఎన్సీపీలోనే ఉన్నట్లు ఇవాళ చాలా క్లియర్ గా చెప్పారన్నారు. మహా వికాస్ అఘాఢి చాలా బలహీనంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటేనన్నారు.

మహా వికాస్ అఘాడి కూటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 180-185 సీట్లు, లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 40 లోక్‌సభ స్థానాలను గెలుస్తుందన్నారు సంజయ్ రౌత్. 2024లో జరగనున్న ఎన్నికల్లో ఎంవీఏ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి కనీసం 110 ఎంపీ సీట్లు తగ్గుతాయని సంజయ్ రౌత్ వెల్లడించారు.

ఇది కమలం సీజన్ కాదని.. ప్రస్తుత  మార్కెట్‌లో తనకు కమలం కనిపించడం లేదంటూ బీజేపీకి కౌంటర్ వేశారు సంజయ్ రౌత్ .  ప్రస్తుత మార్కెట్లో  ఇతర పూలు చాలా ఉన్నాయని.. త్వరలో మీరు చాలా  పువ్వులను చూస్తారన్నారు.

https://twitter.com/ANI/status/1648324982383181827