నిలకడగా శరత్ బాబు ఆరోగ్యం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడి కుమారుడు

నిలకడగా శరత్ బాబు ఆరోగ్యం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడి కుమారుడు

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. శరత్ బాబు ఆరోగ్యంపై దయచేసి ఎలా తప్పుడు ప్రచారం చేయకండంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు చెప్పినట్టు ఆయుష్ వెల్లడించారు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని కోరుకునే ఫ్యాన్స్ కు, శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతకుముందు శరత్ బాబు హెల్త్ పై ఆయన సోదరి స్పందించారు. సోషల్ మీడియా లో శరత్ బాబు గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. ఆయన ప్రస్తుతం కొంచెం రికవరీ అయ్యి, వేరే రూమ్ కి షిఫ్ట్ చేశారని చెప్పారు, తొందర్లోనే శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడతారని ఆశిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలేవీ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

కొన్ని రోజుల క్రితం శరత్ బాబు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ఇంతకుమునుపే వెల్లడించారు. 71 ఏళ్ల శరత్ బాబుకు వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కన్నుమూశారని పలు వార్తలు వచ్చాయి. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో శరత్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పెట్టారు. దీంతో కొన్ని వార్తా వెబ్‌సైట్లు సైతం వార్తలు రాసేశాయి. వీటిని చూసిన శరత్ బాబు సోదరి స్పందించారు. మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. శరత్ బాబు ఆరోగ్యం బాగానే ఉందని.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చి వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు, తమ స్వగ్రామంలో ఉన్న శరత్‌ బాబు సోదరుడు కూడా ఆయన చనిపోలేదని మీడియాకు వెల్లడించారు.