సిద్దిపేట, వెలుగు: తనకు సహకరించకుండా అన్న కూడా పోటీలో నిలపడడంతో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో మాజీ ఉప సర్పంచ్ జి.ఎల్లయ్య, అతడి అన్న బాల్ నర్సయ్య, బాబాయ్ కొడుకు సాయిలు బరిలో ఉండాలని డిసైడ్ అయ్యారు. వీరంతా ఒకే కుటుంబం కావడంతో ముగ్గురు పోటీ పడితే ప్రత్యర్థులకు లాభం జరుగుతుందని భావించారు.
బాల్ నర్సయ్య పోటీ నుంచి తప్పుకుని మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు నామినేషన్ వేయండని ఎల్లయ్య, సాయిలుకు సూచించాడు. కానీ వీరిద్దరూ నామినేషన్లు వేశారు. దీంతో ఎల్లయ్య మనస్తాపానికి గురయ్యాడు. సొంత కుటుంబీకులే తనకు సహకరించడం లేదని మంగళవారం పురుగుల మందు తాగాడు. సిద్దిపేట జిల్లా హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ఇచ్చారు.
