గుండె పోటుతో సర్పంచ్ మృతి

గుండె పోటుతో సర్పంచ్  మృతి

మక్తల్, వెలుగు: నారాయణ పేట జిల్లా మక్తల్  మండలం సంగంబండ సర్పంచ్  రాజు(45) శుక్రవారం గుండె పోటుతో చనిపోయాడు. ఉదయం గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు.

 ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సంగంబండ గ్రామానికి వచ్చి రాజు డెడ్​బాడీని పరిశీలించి నివాళులు అర్పించారు. సర్పంచ్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.