సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడొద్దు, అధైర్యపడొద్దు

సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడొద్దు, అధైర్యపడొద్దు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, గ్రామ సర్పంచ్‌లకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.73, 74 రాజ్యాంగ అధికరణలకు టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, - గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లక్ష్యమని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు భాజపా ఎప్పుడూ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

సర్పంచ్‌ల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలన్న బండి సంజయ్‌.... గ్రామాలకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు, గ్రామసర్పంచ్‌ల హక్కులు పరిరక్షణ కోసం త్వరలోనే బిజెపి శాఖ మౌనదీక్ష చేపడుతుంని తెలిపారు.-  పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తుందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 2014 లో ‘‘గ్రామీణాభివృద్ధి`, పంచాయతీరాజ్‌ వ్యవస్థ’’ అనే అంశం కింద ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడొద్దు, అధైర్యపడొద్దన్న ఆయన...  మీకు బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. - గ్రామసర్పంచ్‌లు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు సగర్వంగా తలెత్తుకునేలా చేసే బాధ్యత బిజెపిదని చెప్పుకొచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం... గ్రామస్వరాజ్యం సాదిద్దాం ... రామరాజ్యాన్ని నిర్మించుకుందాం ... అంటూ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం...

పుతిన్ మూడేళ్లకు మించి బతకడం కష్టమే ?

బాలి ఫొటోగ్రాఫర్ సాహసం