
- సీఎస్ఆర్ నిధులతో పనులు చేయడానికి ముందుకొచ్చిన సంస్థ
హైదరాబాద్సిటీ, వెలుగు: కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో తమ సొంత నిధులతో జంక్షన్ల బ్యూటిఫికేషన్ చేపట్టడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ముందుకొచ్చింది. హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్లో తమ సీఎస్ఆర్ నిధులతో పనులు చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదనలు సమర్పించగా, అనుమతించినట్లు మెట్రోపాలిటన్కమిషనర్సర్ఫ్రాజ్అహ్మద్తెలిపారు. దీంతో నియోపోలిస్ సెజ్ వద్ద రోటరీ జంక్షన్, మోకిలా రోడ్డులోని రెండు ట్రయాంగిల్ జంక్షన్లలో ల్యాండ్ స్కేపింగ్, బ్యూటిఫికేషన్ పనులను సత్వా గ్రూప్ నిర్వహించనుంది.
దీనికయ్యే ఖర్చంతా సత్వాగ్రూపే భరిస్తుందని, బ్యూటిఫికేషన్తో పాటు ఐదేండ్ల మెయింటెనెన్స్చేసేలా ఆ సంస్థ హెచ్ఎండీఏతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ జంక్షన్లను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం కొంతమేరకు తీర్చిదిద్దగా, సత్వా గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు, అందమైన నిర్మాణాలతో భారీగా అభివృద్ధి చేయనుంది.