రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ కు స్పోర్ట్స్ బైక్స్ అంటే ప్రాణం. కారుకంటే బైక్ పై వెళ్లడమే అతడికి ఇష్టం. అందుకే తన గ్యారేజ్ లో నాలుగు స్పోర్ట్స్ బైక్ లు పెట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇందులో రెండు స్పోర్ట్స్ బైక్ లు గిఫ్టుగా వచ్చినవి. ఒకటి పవన్ కళ్యాణ్, మరొకటి సాయి ధరమ్ తేజ్ తల్లి తనకు గిఫ్ట్ గా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన అల్లుడికి అవేంజర్ ను గిఫ్ట్ గా ఇవ్వగా.. హార్లే డేవిడ్ సన్ ను తన తల్లి గిఫ్ట్ గా ఇచ్చింది. మరో రెండు స్పోర్ట్స్ బైక్ లను సొంతంగా కొనుగోలు చేశాడు సాయి ధరమ్ తేజ్. అయితే గత కొన్ని రోజులుగా ప్రమాదానికి గురైన బైక్ ను వినియోగిస్తున్నాడు.
శుక్రవారం రాత్రి 8 గంటలకు బైక్ పై వెళ్తున్న సాయిధరమ్ తేజ్ మాదాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఇపుడు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని..ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.