న్యూఢిల్లీ : దేశీయ ఈఎస్జీ ఫైనాన్సింగ్ మార్కెట్ కోసం బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) సేకరించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బుధవారం తెలిపింది. సిండికేటెడ్ సోషల్ లోన్ ద్వారా బిలియన్ డాలర్లు తీసుకున్నామని (750 మిలియన్ డాలర్లు, 250 మిలియన్ల డాలర్ల గ్రీన్ షూ) ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. లోన్ బుక్ను ఈ నెల రెండో తేదీన మూసివేశామని పేర్కొంది.
గత సంవత్సరం కూడా ఎస్బీఐ బిలియన్ డాలర్ల సిండికేటెడ్ సోషల్ లోన్ను సేకరించింది. ఈ ఫండ్ దేశీయ ఈఎస్జీ (పర్యావరణ, సామాజిక, పాలన) ఫైనాన్సింగ్ మార్కెట్కు ఉపయోగపడుతుంది. రెండు టెనార్ల (వ్యవధి) ద్వారా నిధులను సేకరించింది. ఒకటి మూడు సంవత్సరాలది కాగా, రెండోది ఐదు సంవత్సరాల లోన్. సెప్టెంబర్ 30, 2023తో ముగిసిన రెండవ క్వార్టర్లో బ్యాంక్ నికర లాభం 8 శాతం పెరిగి రూ.14,330 కోట్లకు చేరుకుంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 12.3 శాతం పెరిగి రూ.39,500 కోట్లకు చేరుకుంది.