
- హైదరాబాద్ లో రిటైర్డ్ ఉద్యోగిని మోసగించిన స్కామర్లు
బషీర్బాగ్, వెలుగు: ఫేక్ అరెస్టు వారెంట్ పంపించి రిటైర్డ్ ఉద్యోగి వద్ద స్కామర్స్ రూ.32 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. తార్నాక పరిధి లాలాగూడ ప్రాంతానికి చెందిన 83 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగికి స్కామర్స్ గత నెల 23న ఫోన్ కాల్ చేశారు. ఆయన వివరాలు తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరిట నకిలీ అరెస్ట్ వారెంట్ పంపించారు.
మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈడీ , పోలీస్ అధికారులుగా నమ్మిస్తూ భయపెట్టారు. ఆయనతో పాటు భార్యను అరెస్ట్ చేసి ముంబైకు తీసుకెళ్తామని హెచ్చరించారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతను పలు దఫాలుగా రూ.32 లక్షలు పంపించాడు. ఆ తర్వాత మోసపోయినట్లు తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.