
చెన్నూర్, వెలుగు: చెన్నూర్ ఎస్బీఐ–2లో బ్యాంక్ అధికారులే 20 కిలోల 200 గ్రాముల బంగారం, రూ.1.16 లక్షలను కాజేయగా.. నిందితులను అరెస్ట్చేసి, సొత్తు రికవరీ చేసిన విషయం తెలిసిందే.
గురువారం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ రవీందర్, తాత్కాలిక ఉద్యోగి సందీప్ ను బ్యాంక్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మొత్తం 44 మందిని అరెస్ట్చేశామని ఏసీపీ పేర్కొన్నారు.