ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా…కొత్త షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ :
మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్, ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1, ఏప్రిల్ 6న ఇంగ్లీష్ పేపర్-2, ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1, ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2, ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్-1, ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2.