- హైదరాబాద్కు వచ్చి ఆందోళనలు చేస్తున్నరు..
- డీఈవోల మీటింగ్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ టీచర్లకు ఈ టైమ్లో సెలవులు ఇవ్వొద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఆందోళనలు, ధర్నాలు చేసేందుకు హైదరాబాద్ వస్తున్నారని, వారిని అక్కడే ఆపాలని సూచించారు. అయితే హెడ్మాస్టర్లు సెలవులు ఇస్తున్నారనీ డీఈవోలు చెప్పడంతో.. వారికి ఈ విషయం చెప్పాలని ఆదేశించారు. సోమవారం ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో ఆర్జేడీలు, డీఈవోలతో స్కూల్ఎడ్యుకేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 11గంటలకు సమావేశం ఉందని షెడ్యూల్ ఇచ్చినా.. మధ్యాహ్నం వరకు డైరెక్టర్ గానీ, ఇతర ఉన్నతాధికారులు గానీ అక్కడికి రాలేదు. దీంతో కొందరు డీఈవోలు ఫోన్లు చేస్తే.. సెక్రటేరియెట్లో పనిలో ఉన్నట్టు చెప్పారు. చివరికి మధ్యాహ్నం 3కు సమావేశానికి వచ్చారు. సమావేశం సాయంత్రం 7 వరకూ సాగింది.